రాజీనామా పత్రంతో సభకు వచ్చిన స్పీకర్‌!

Update: 2019-07-23 13:42 GMT

రాజీనామా దిశగా కర్ణాటక సీఎం కుమారస్వామి అడుగులు వేస్తున్నారు. బలపరీక్షకు ముందే.. కుమారస్వామి గవర్నర్‌ను కలిసి రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో సభలో బలపరీక్షపై ఓటింగ్‌ జరిగే అవకాశం కనిపించడం లేదు. అసెంబ్లీలో భావోద్వేగంతో సుదీర్ఘంగా ప్రసంగించిన కుమారస్వామి బలపరీక్ష ను కావాలనే ఆలస్యం చేయలేదన్నారు. పదవీత్యాగానికి సిద్ధమని ప్రకటించిన కుమారస్వామి సోనియా విజ్ఞప్తి చేస్తేనే సంకీర్ణానికి నాయకత్వం వహించానన్నారు.

సభలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ భావోద్వేగ ప్రసంగం చేశారు. అన్నింటికీ సిద్ధపడే సభలోకి అడుగుపెట్టానని అన్నారు. అవసరం అయితే రాజీనామా చేసేందుకు కూడా వెనుకాడని ప్రకటించారు. జేబులో ఉన్న తన రాజీనామా పత్రాన్ని సభ్యులకు చూపించారు. ఇదిలా ఉంటే బెంగళూరులో 144 సెక్షన్‌ అమల్లో ఉంది రేపటి వరకు నిషేదాజ్ఞలు కొనసాగుతాయని.. పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. 

Tags:    

Similar News