కర్ణాటక హైకోర్టులో శశికళకు చుక్కెదురు

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు శశికళ ఏ క్షణమైనా విడుదల కావచ్చిని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. కర్ణాటక హైకోర్టులో ఆమెకు చుక్కెదురయింది.

Update: 2020-12-05 10:58 GMT

త‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స‌న్నిహితురాలు శశికళ ఏ క్షణమైనా విడుదల కావచ్చిని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. కర్ణాటక హైకోర్టులో ఆమెకు చుక్కెదురయింది. శశకళ వర్గీయులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆమె వర్గీయులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. అక్ర‌మాస్తుల కేసులో బెంగ‌ళూరులోని ప‌ర‌ప్ప‌న అగ్ర‌హార జైల్లో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు శశికళ. ఇప్ప‌టికే శ‌శిక‌ళ త‌ను క‌ట్టాల్సిన ప‌ది కోట్ల రూపాయ‌ల ఫైన్ మొత్తాన్ని కూడా క‌ట్టేసిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. డీడీ రూపంలో చెల్లింపులు జ‌ర‌గ‌డంతో.. శ‌శిక‌ళ అతి త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంద‌నే పుకార్లు కొన్ని రోజులుగా శికార్లు చేస్తున్నాయి. కర్ణాటక హైకోర్టు తీర్పుతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది.

Tags:    

Similar News