ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి రోజులు వస్తాయి: రామ్నాథ్ కోవింద్
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి రోజులు వస్తాయన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దేశంలో వర్తించే చట్టాలన్నీ కశ్మీర్కు వర్తించడం ద్వారా కశ్మీర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీరీలకు మంచి రోజులు వస్తాయన్నారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దేశంలో వర్తించే చట్టాలన్నీ కశ్మీర్కు వర్తించడం ద్వారా కశ్మీర ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. కశ్మీరీ యువతకు నాణ్యమైన విద్య లభించడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు రాష్ట్రపతి. 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ జాతినుద్దేశించి కోవింద్ ప్రసంగించారు. మేలో జరిగిన సాధారణ ఎన్నికలు, గురునానక్ 550వ జయంతి, మహాత్మాగాంధీ 150 జయంతితో పాటు పలు అంశాలను కోవింద్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.