జార్ఖండ్ వికాస్ మోర్చా బీజేపీలో విలీనం అయింది. జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండి తన పార్టీని బీజేపీలో కలిపేశారు. బీజేపీకి గుడ్బై చెప్పి సొంత పార్టీ పెట్టుకున్న మరాండి దాదాపు 14 ఏళ్ల తర్వాత తిరిగి కమలం గూటికి చేరారు.
సోమవారం రాంచీలో జరిగిన ఓ కార్యక్రమంలో హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించిన మరాండి కమలం కండువా కప్పుకున్నారు. జేవీఎమ్ పార్టీని బీజేపీలో విలీనం చేయబోతున్నట్లు ఫిబ్రవరి 11న ప్రకటించిన ఆయన నేడు వేల మంది కార్యకర్తల సమక్షంలో పార్టీని విలీనం చేశారు.