ప్రపంచంలోనే అతిపెద్ద వైద్య సదుపాయాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. రూ. 24,375 కోట్ల పెట్టుబడితో దేశంలో కొత్తగా 75 వైద్యకళాశాలలను నిర్మిస్తామని ప్రకాశ్ జవదేకర్ వెల్లడించారు. 2021-22 లోగా కొత్త వైద్య కళాశాలలు పూర్తి చేస్తామని, తద్వారా 15,700 ఎంబీబీఎస్ సీట్లు కొత్తగా వస్తాయని చెప్పారు. ఇప్పటి వరకూ వైద్యకళాశాలలు లేని చోట్లలో వీటిని నిర్మిస్తామని అన్నారు.