నడి రోడ్డుపై కుర్చివేసి మద్యం దుకాణం ఓపెన్ చేసిన మందుబాబు
*సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ఏకంగా రోడ్డుపైనే మద్యం దుకాణం పెట్టాడో వ్యక్తి. కొత్వాలిలోని రద్దీగా ఉండే రోడ్డుపై దర్జాగా ఓ కుర్చీ వేసుకొని, చేతిలో గ్లాస్ పట్టుకున్నాడు. మరో వ్యక్తి ఆ గ్లాస్ లో మందు పోసి, నీళ్లు కలపగా.. అందరూ చూస్తుండగానే ఆ వ్యక్తి కాలుమీద కాలు వేసుకొని మద్యం సేవించాడు. దీంతో ట్రాఫిక్ కొంత అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆ వ్యక్తిని అక్కడినుంచి పంపించేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.