భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాఫ్టర్ శుక్రవారం మధ్యాహ్నం పంజాబ్లోని హోషియార్పూర్లో అత్యవసర పరిస్థితుల్లో ల్యాండయింది. పంజాబ్లోని హోషియార్పూర్లోని ఒక క్షేత్రంలో అపాచీ హెలికాఫ్టర్ అత్యవసర ల్యాండింగ్ అయిందని అధికారులు తెలిపారు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని.. పఠాన్ కోట్ లోని ఐఎఎఫ్ స్థావరంతో జిల్లా పోలీసులు సంప్రదిస్తున్నారని. హెలికాప్టర్కు ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలు తెలిపాయి.
హెలికాఫ్టర్ను పరిశీలించిన అనంతరం దాన్ని తిరిగి ఎయిర్బేస్కు తరలిస్తామని ఎయిర్ఫోర్స్ అధికారులు తెలిపారు. "ట్యాంక్ బస్టర్స్" అని కూడా పిలువబడే అమెరికన్ తయారీ అపాచీని, భారతదేశం ఇటీవల 1.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో కొనుగోలు చేసింది.
మొత్తం ఇరవై రెండు సరికొత్త అపాచీ అటాక్ హెలికాప్టర్లను భారత్ ఆర్డర్ చేసింది. మొదటి బ్యాచ్ను గత ఏడాది సెప్టెంబర్లో ఇండియాకు చేర్చింది అపాచీ సంస్థ. ఈ హెలికాఫ్టర్ ప్రపంచంలోని అత్యంత అధునాతన దాడి హెలికాప్టర్లుగా పరిగణించబడుతుంది..యుఎస్ వైమానిక దళం ఎక్కువగా వీటిని వినియోగిస్తున్నారు. ఇదిలావుంటే వైమానిక దళానికి చెందిన చీతా హెలికాఫ్టర్ సైతం గురువారం ఘజియాబాద్ ఎయిర్బేస్ నుంచి చండీగఢ్ వెళుతూ సాంకేతిక సమస్యలతో ఈ ప్రాంతంలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే.