చట్టం ఎవరికీ చుట్టం కాదు అని చెప్పేందుకు ఇదో ఉదాహరణ... న్యూ ట్రాఫిక్ రూల్స్ ని పాటించకుండా బైక్ నడిపరంటూ పుదుచ్చేరి సీఎం నారాయణసామి జరిమానా కట్టాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆదేశించారు. అతనిచేత వెంటనే జరిమానని కట్టించుకోవాలని ఆ రాష్ట్ర డీజీపీని ఆమె ఆదేశించారు. కామరాజనగర్ ఉప ఎన్నికల చివరి రోజు ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అందులో సీఎం నారాయణసామి కూడా పాల్గొన్నారు. కానీ అయన హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది . దీనితో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ కల్పించుకొని ఫైన్ కట్టాలంటూ పేర్కొన్నారు. దీనితో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.