Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌ లో వరదల వల్ల ఏడుగురు మృతి

* వరదల వల్ల ఏడుగురు మృతి, 19 మంది గల్లంతు * మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటన

Update: 2021-07-29 01:55 GMT

జమ్ము కశ్మీర్‌లో తుపాను బీభత్సం

 Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. కిష్టావర్ జిల్లా హంజర్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. హంజార్ గ్రామంలో ఇళ్లు కొట్టుకుపోయాయి. గ్రామానికి చెందిన పలువురు వరదల్లో కొట్టుకుపోయారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మరణించారు. మరో 30 నుంచి 40 మంది గల్లంతయినట్టు తెలుస్తోంది. 9 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మృతుల కుటుంబాలకు 5లక్షల చొప్పున పరిహారం ప్రభుత్వం ప్రకటించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Tags:    

Similar News