మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ రాజ్యసభకు పోటీచేయనున్నారు. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. దేవెగౌడ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఆయన కుమారుడు కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, తన పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీచేయాలని కోరడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నానని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా 18 రాజ్యసభ స్థానాలకు జూన్ 19న ఎన్నికలు జరగనున్నాయి.