హరియానాలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 90 స్థానాలకు గాను 40 సీట్లను కైవసం చేసుకుంది. 10 సీట్లు గెలుచుకున్న జేజేపీ బీజేపీకి మద్ధతు ప్రకటించింది. దీంతో హర్యానాలో కమలదళం మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే పొత్తులో భాగంగా జేజేపీకి డిప్యూటీ సీఎం పదవి దక్కనుంది. ఇవాళ ఛండీఘడ్లో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ప్రస్తుత సీఎం మనోహర్లాల్ ఖట్టర్ను తమ నేతగా ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ఖట్టర్ గవర్నర్ను కలిసి కోరానున్నారు. దీపావళి తర్వాత ప్రమాణస్వీకారం ఉండనుంది.