ఉద్యోగులకు శుభవార్త: ATM, UPI ద్వారా పిఎఫ్ విత్ డ్రా క్షణాల్లోనే అకౌంట్లోకి రూ.లక్ష!
జూన్ 2025 నుంచి అమల్లోకి వచ్చే EPFO 3.0తో ఉద్యోగులు ATM లేదా UPI ద్వారా తక్షణంగా రూ.1 లక్ష వరకు పీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు. వేగవంతమైన సేవలతో నిధులు క్షణాల్లో ఖాతాలోకి.
ఉద్యోగులకు శుభవార్త: ATM, UPI ద్వారా క్షణాల్లోనే అకౌంట్లోకి రూ.లక్ష!
జూన్ 2025 నుంచి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) EPFO 3.0 పేరిట ఓ ఆధునిక వ్యవస్థను ప్రవేశపెట్టబోతోంది. ఈ నూతన వ్యవస్థతో EPF సభ్యులు ఇకపై ATMల ద్వారా లేదా UPI ప్లాట్ఫాంల ద్వారా తక్షణమే తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) నుంచి నిధులను విత్డ్రా చేసుకోవచ్చు.
తక్షణంగా రూ. 1 లక్ష వరకు విత్డ్రా
ఇప్పటి వరకు పీఎఫ్ నిధుల్ని విత్డ్రా చేయాలంటే ఆన్లైన్లో క్లెయిమ్ దాఖలు చేసి, EPFO ఫీల్డ్ కార్యాలయాల నుంచి ఆమోదం కోసం కొన్ని రోజులు లేదా వారాలు వేచి ఉండాల్సి వచ్చేది. కానీ కొత్త సాంకేతిక వ్యవస్థతో ఈ సమయము పూర్తిగా తగ్గనుంది. అత్యవసర పరిస్థితుల్లో సభ్యులు రూ. 1 లక్ష వరకు తక్షణంగా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రధాన లక్షణాలు:
UPI, ATMల ద్వారా విత్డ్రా సదుపాయం
పీఎఫ్ బ్యాలెన్స్ను UPI ప్లాట్ఫాంలలో చెక్ చేసి, నేరుగా బ్యాంక్ ఖాతాకు నిధులను బదిలీ చేసుకునే వీలుంటుంది.
సమయాన్ని ఆదా చేసే ప్రక్రియ
క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం ఇకపైనా రోజుల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేదు. నిధుల ట్రాన్స్ఫర్ తక్షణమే జరుగుతుంది.
అత్యవసర సమయంలో ఉపశమనంగా
వైద్య ఖర్చులు, ఇంటి నిర్మాణం, విద్య, వివాహం లాంటి అవసరాల కోసం ప్రస్తుతం EPFO విత్డ్రాలను అనుమతిస్తోంది. ఇప్పుడు అదే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
ఈపీఎఫ్ సభ్యులు తమ KYC వివరాలు పూర్తిగా అప్డేట్ చేసి, అవసరమైన పత్రాలను సమర్పించినట్లయితే ఈ సదుపాయాన్ని సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ మార్పులు కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మద్దతుతో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సహకారంతో అమలులోకి రానున్నాయి.
ఈ నవీనీకరణతో కోట్లాది మంది ఉద్యోగులకు తక్షణ నగదు అవసరాలపై కొంత ఊరట లభించనుంది. EPFO 3.0 ద్వారా పీఎఫ్ సిస్టమ్ మరింత ఆధునీకృతం, వేగవంతమైనదిగా మారబోతోంది.