తిరుమల తిరుపతి దేవస్థానంలో మరోసారి నిధుల గోల్మాల్ జరిగింది. ఢిల్లీలో నిర్మించిన ఆలయంలో నిర్వహించే నిత్య కైంకర్యాల విషయంలో చేతివాటం ప్రదర్శించినట్లు.. ఓ భక్తుడు ఆధారాలతో సహా నిరూపించాడు. నిత్య పూజ కోసం వినియోగించే పూలు, ప్రసాదం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణలో సప్లై చేసే కాంట్రాక్టర్ నుంచి సిబ్బంది వరకు నెలవారీ ముడుపులు తీసుకుంటున్నట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.