బెంగళూరులో కూలిన నాలుగు అంతస్తుల భవనం

Update: 2019-07-10 05:38 GMT

బెంగళూరులోని పులకేశి నగర్‌ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ నాలుగు అంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో ఘటనలో బిహార్‌కు చెందిన ఓ కార్మికుడు మృతి చెందాడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఎమినిది మందిని శిథిలాల నుంచి వెలికి తీశారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మూడో అంతస్తులో ఏడుగురు కార్మికులు కుటుంబసభ్యులతో కలిసి వాసముంటున్నారని..వారంతా శిథిలాల కింద చిక్కుకొని ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. వీరంతా ఉత్తరాదికి చెందిన కార్మికులని స్థానికులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Full View

Tags:    

Similar News