మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Update: 2020-05-25 02:49 GMT

కరోనా వైరస్‌ మహ్మమారి ఏ ఒక్కరినీ వదలడంలేదు. చిన్న పిల్లల నుంచి వందేళ్ల వృద్ధులనూ మృత్యు ఒడిలోకి చేర్చుకుంటోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌ (61)కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు.కరోనా లక్షణాలు సోకాయన్న అనుమానంతో పరీక్షలు నిర్వహించగా... ఆ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ అని తేలిందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు స్వగ్రామంలోనే వైద్యం అందిస్తున్నారని అధికారులు తెలిపారు.

తరుచుగా ఆయన ముంబై నుంచి ఆయన స్వగ్రామానికి ప్రయాణిస్తూ ఉంటారు. దీంతోనే ఆయనకు పాజిటివ్ అని తేలిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఆయన ప్రస్తుతం ఆ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా, ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవద్ కూడా కరోనా బారినపడ్డారు. రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత ఆయన కోలుకున్నారు. మహారాష్ట్రలో నిన్నటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటి 50,231గా నమోదైంది.

Tags:    

Similar News