మనిషి రక్తం రుచి మరిగి ప్రజలను వణికించిన పులి ఎట్టకేలకు చిక్కింది. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ప్రజలకు రెండు నెలలుగా కంటిమీద కునుకును దూరం చేసిన పులిని అటవీ అధికారులు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నారు. జంతువులు,మనుషులను చంపితిన్న పులిని బంధించడం కోసం రంగంలోకి దిగిన అటవీ అధికారులు బండిపూర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో పట్టుకుని బందించారు. అనంతరం మైసూరు జూకు తరలించారు. ఇన్నాళ్లుగా తమను హడలెత్తిస్తున్న ఈ క్రూర జంతువు పట్టుబడడంతో గ్రామస్థులతో పాటు అటవీ అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.