ఢిల్లీ వాసులను వరుస అగ్నిప్రమాదాలు వణికిస్తున్నాయి. తెల్లవారుజామున నరేలా పారిశ్రామిక వాడలో మరో అగ్నిప్రమాదం సంభవించింది. రెండు పరిశ్రమల్లో చెలరేగిన మంటలు క్రమంగా వ్యాపిస్తున్నాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఘటన స్థలంలో దట్టంగా పొగలు వ్యాపించాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
అయితే ఢిల్లీలోని ఖిరారి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మృతి చెందగా 24గంటలు ముగియకముందే మరో ఫైర్ యాక్సిడెంట్ చోటుచేసుకుంది. ఇక ఈ నెల 8న ఢిల్లీలోని అనాజ్మండిలో గల ఒక ప్లాస్టిక్ సంచుల కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.