న్యూఢిల్లీలోని రైల్వేస్టేషన్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చండీఘర్ కచువేలీ రైలు పవర్ కంపార్ట్మెంట్లో ప్రమాదం సంభవించింది. పవర్ కంపార్ట్మెంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు బోగీలు దగ్ధమయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే నాలుగు ఫైరింజన్లను రంగంలో దించారు. రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించిన కారణంగా పెను ప్రమాదం తప్పింది.