Coonoor: తమిళనాడు కూనూర్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం
Coonoor: సుమారు 100 ఎకరాలకుపైగా అగ్నికి ఆహూతి
Coonoor: తమిళనాడులోని కూనూర్ అటవీ ప్రాంతంలో చెలరేగుతున్న మంటలను ఆర్పేందుకు ఇండియన్ ఎయిర్ఫోర్స్ రంగంలోకి దిగింది. అటవీ ప్రాంతంలో ఎండిన కర్పూరం చెట్లు, పొదలు ఎక్కువగా ఉండటమే కాకుండా.... భారీ గాలులు వీయడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో కూనూర్, కోటగిరి, ఊటీ, గూడలూర్, మెట్టుపాళయం, సత్యమంగళం ప్రాంతాలకు చెందిన 150 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. సుమారు 100 ఎకరాలకుపైగా అటవీ ప్రాంతం అగ్నికి ఆహూతి అయిందని ఓ అధికారి తెలిపారు. అగ్నిప్రమాదానికి కారకులైన నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.