ఉన్నావ్ అత్యాచార కేసులో తీస్హజారీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగర్ ను దోషిగా నిర్ధారించింది. ఈ నెల 19న శిక్ష ఖరారు చేయనుంది. రెండేళ్ల క్రితం ఉన్నావ్ అత్యాచార కేసులో కేసు నమోదయ్యింది. ఆగస్టు 5 నుంచి న్యాయమూర్తి ధర్మేశ్శర్మ రోజువారీ విచారణ చేపట్టారు. సుప్రీంకోర్టు చొరవతో లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు బదిలీ అయ్యింది. 2017లో బాలికను కిడ్నాప్ చేసినట్లు కుల్దీప్సింగ్ సెంగార్పై ఆరోపణలు వచ్చాయి. అభియోగాల నమోదుకు 10 రోజుల ముందు కారు ప్రమాదంలో ఉన్నావ్ అత్యాచార బాధితురాలు తీవ్రంగా గాయపడింది. కుల్దీప్ సెంగర్ను బీజేపీ ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.