ఉత్తరాఖండ్ ‌- హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో విషాదం

*హిమపాతంలో చిక్కుకుని 11 మంది పర్వతారోహకులు మృతి *మరో ఐదుగురు గల్లంతు.. సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు

Update: 2021-10-23 08:48 GMT

ఉత్తరాఖండ్ ‌- హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో విషాదం(ఫైల్ ఫోటో)

Uttarakhand - Himachal Pradesh Border: ఉత్తరాఖండ్‌ - హిమాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులో విషాదం చోటుచేసుకుంది. హిమపాతంలో చిక్కుకుని 11 మంది పర్వతారోహకులు మృతి చెందారు. మరో ఐదుగురు గల్లంతుకాగా ఇంకో ఇద్దరు పర్వతారోహకులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎయిర్‌ ఫోర్స్‌ సిబ్బంది గల్లంతైనవారి కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్లతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది. మరోవైపు భారీగా మంచు కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 17వల అడుగుల ఎత్తులో లాంఖగా కనుమ వద్ద ఈ ఘటన జరిగింది.

Tags:    

Similar News