కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయ తీసుకోనుంది. కరోనా వ్యాప్తి లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలతో పాటు, శాసన మండలి ఎన్నికల నిర్వహణపై వచ్చేవారంలో నిర్ణయం తీసుకోనున్నట్టు ఎన్నిక సంఘం ప్రకటించింది.
కరోనా ప్రభావంతో పరిస్థితులను సమీక్షించిన అనంతరం మార్చి 26న వాయిదా పడిన రాజ్యసభ ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. మార్చి 26న రాజ్య సభలోని 55 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 37 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 18 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సివుంది. ఏపీలో కూడా నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.