భూ ప్రకంపనలతో ఉత్తరాది వణికింది. రాజధాని ఢిల్లీతో పాటు కశ్మీర్, పంజాబ్, హర్యానా, గుర్గావ్ సహా పలుచోట్ల భూమి కంపించింది. పాకిస్తాన్ లోని లాహోర్కు 173 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని కనుగొన్నారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1 గా నమోదైంది. జమ్మూకశ్మీర్లోని ఫూంచ్, రాజౌరీ సెక్టార్లలో భూమి తీవ్రంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు.