కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. ఇ-సిగరెట్లపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా నీతారామన్ ప్రకటించారు. పొగాకు వినియోగం వల్ల పిల్లల ఆరోగ్యం క్షీణిస్తోందన్నారు. ఈ-సిగరెట్ల ఉత్పత్తి, దిగుమతులు, ఎగుమతులు, రవాణా, అమ్మకాలు, సరఫరా, నిలువ చేయడం, వాటిపై వాణిజ్య ప్రకటన ఇవ్వడం కూడా ఇక నుంచి నిషేధమే అని సీతారామన్ చెప్పారు. నియమావళిని ఉల్లంఘించిన వారి పట్ల కూడా కఠిన చర్యలు కూడా తీసుకోనున్నారు. ఈ-సిగరెట్లు కలిగి ఉన్నవారికి ఏడాది జైలు శిక్షను అమలు చేయనున్నారు. వారికి అదనంగా లక్ష జరిమానా కూడా విధించనున్నారు. ఎలక్ట్రానిక్ నికోటిన్ను అదుపు చేయాలని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, యూటీలకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.
#UnionCabinet has today approved the Promulgation of the Prohibition of Electronic Cigarettes (production, manufacture, import, export, transport, sale, distribution, storage and advertisement) Ordinance, 2019.#cabinetdecisions pic.twitter.com/rQg1NUMzbL
— PIB India (@PIB_India) September 18, 2019