కరోనా కట్టడికి డీమార్ట్ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాలకు కూడా..
కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి డి-మార్ట్ రిటైల్ చైన్ ఆపరేటర్ అవెన్యూ సూపర్మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమాని ముందుకొచ్చారు..
కోవిడ్ -19 మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడటానికి డి-మార్ట్ రిటైల్ చైన్ ఆపరేటర్ అవెన్యూ సూపర్మార్ట్స్ ప్రమోటర్ రాధాకిషన్ దమాని ముందుకొచ్చారు.. పిఎం కేర్స్ ఫండ్ అలాగే వివిధ రాష్ట్ర సహాయ నిధులకు రూ .155 కోట్లు విరాళంగా ఇచ్చారు. శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో, దమాని పిఎం కేర్స్ ఫండ్కు రూ .100 కోట్లు, పదకొండు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్వహిస్తున్న రిలీఫ్ ఫండ్లకు రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్లకు రూ.10 కోట్లు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలకు రూ.5 కోట్లు, తమిళనాడు, ఛత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్లకు రూ.2.5 కోట్లు ఇస్తున్నట్లు రాధాకిషన్ దమాని పేర్కొన్నారు.
కాగా దీనిపై రాధాకిషన్ దమాని మాట్లాడుతూ.. సాధారణ ప్రజలను రక్షించడానికి భారత, కేంద్ర, స్థానిక ప్రభుత్వ సంస్థలు తీసుకున్న వేగవంతమైన చర్యలకు మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాము. మన సమాజాలను మరియు తోటి వారిని రక్షించడానికి మనలో ప్రతి ఒక్కరూ కూడా మనవంతుకృషి చేయాలి" అని పేర్కొన్నారు. కాగా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారతదేశం ప్రస్తుతంమూడు వారాల లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 తో ముగుస్తుంది. మరోవైపు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ యొక్క తాజా నివేదిక ప్రకారం, దేశవ్యాప్తంగా 525 తాజా అంటువ్యాధులు నమోదయ్యాక, దేశంలో శనివారం నాటికి మొత్తం COVID-19 కేసులు 3,000 మార్కును దాటాయి.