కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ 4.0 విధించినప్పటికి కరోనా కేసులు మాత్రం ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 500 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,554కి పెరిగింది. ఇందులో 5,638 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 166 మంది మరణించగా, 4,750 మంది నయమై డిశ్చార్జి అయ్యారు.