లాక్డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. ఈ నెల 14 వరకు ఉన్న లాక్డౌన్ ను మరో 15 రోజులు పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు లాక్డౌన్ను పొడిగించింది. సీఎం నవీన్ పట్నాయక్ అధ్యక్షతన ఐదుగురు సీనియర్ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.
#COVID19: Odisha extends lockdown till April 30th, the first state to do so pic.twitter.com/8t3FgFlOft
— ANI (@ANI) April 9, 2020