లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకున్న ఒడిశా

Update: 2020-04-09 07:17 GMT

లాక్‌డౌన్ పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకుంది ఒడిశా ప్రభుత్వం. ఈ నెల 14 వరకు ఉన్న లాక్‌డౌన్‌ ను మరో 15 రోజులు పెంచుతూ ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. సీఎం నవీన్‌ పట్నాయక్‌ అధ్యక్షతన ఐదుగురు సీనియర్‌ మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి ఆమోదం తెలుపుతూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది.  



Tags:    

Similar News