తమిళనాడులో ఒక్కరోజే 66 కేసులు.. అందులో ఆరుగురు చిన్నారులు..
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.. తాజాగా ఇవ్వాళ ఒక్కరోజే 66 కేసులు నమోదు అయ్యాయి. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇందులో రెండేళ్ల పాప, నాలుగేళ్ల బాబు సహా ఆరుగురు చిన్నారులు ఉన్నారు.
తాజా కేసులతో కలిపి తమిళనాడులో 1821 కేసులు నమోదు అయినట్టు అయింది. ఇందులో 835 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. ఇప్పటి వరకు 960 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇవాళ ఒక్కరోజే 94 మంది డిశ్చార్జయినట్టు అధికారులు వెల్లడించారు. ఇక 23 మంది కరోనాతో మృతి చెందారు. భారత్ లో మొత్తం కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి ఇప్పటివరకు 24,942 కేసులు నమోదు కాగా, 5,210 మంది కోలుకున్నారు. 779 మంది చనిపోయారు.