కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకుదేశవ్యాప్తంగా మూడువారాల పాటు లాక్ డౌన్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్ ఒకటి నుంచి చేపట్టాల్సిన ఎన్పీఆర్(జాతీయ పౌర పట్టిక), జనగణన ప్రక్రియను వాయిదా వేసింది. కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జనాభా లెక్కలు, ఎన్ఫీఆర్ నిర్వహించాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేస్తున్నట్లు కేంద్రహోంశాఖ వెల్లడించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకూ ఈ వాయిదా అమల్లో ఉంటుందని కేంద్రం తెలిపింది.
In view of #COVID19 outbreak, the first phase of Census 2021 and the updation of National Population Register (NPR) postponed until further orders: Ministry of Home Affairs pic.twitter.com/Gv9ZZhf1KR
— ANI (@ANI) March 25, 2020