ఇంజనీరుపై బకెట్లతో బురద చల్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Update: 2019-07-04 10:22 GMT

ప్ర‌జాప్ర‌తినిధులు ప్ర‌వ‌ర్తిస్తున్న తీరు పీక్ స్టేజ్‌కు చేరింది. కొంద‌రు ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందంతో ఊగిపోతున్నారు. ఇటీవ‌ల ఇండోర్‌లో ఓ బీజేపీ ఎమ్మెల్యే మున్సిప‌ల్ ఆఫీస‌ర్‌ను బ్యాట్‌తో కొట్టిన విష‌యం తెలిసిందే. తాజాగా గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ ఇంజినీర్‌పై బ‌కెట్ల‌తో బుర‌ద పోశాడు. కంకావ‌లి వ‌ద్ద ముంబై-గోవా ర‌హ‌దారిపై ఉన్న బ్రిడ్జ్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎమ్మెల్యే నితేశ్‌ రాణా, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు ఇంజినీర్ ప్ర‌కాశ్ షెడేక‌ర్‌పై బ‌కెట్ల ద్వారా బుర‌ద‌ను పోశారు. ఆ త‌ర్వాత ఆ ఇంజినీర్‌ను బ్రిడ్జ్‌కు క‌ట్టేశారు. హైవేపై గ‌తుకులు ఉన్న‌ట్లు గుర్తించిన ఎమ్మెల్యే, అత‌ని అనుచ‌రులు త‌మ ఆగ్ర‌హాన్ని ఇంజినీర్‌పై చూపించారు.


 

Tags:    

Similar News