ప్రజాప్రతినిధులు ప్రవర్తిస్తున్న తీరు పీక్ స్టేజ్కు చేరింది. కొందరు ఎమ్మెల్యేలు పైశాచిక ఆనందంతో ఊగిపోతున్నారు. ఇటీవల ఇండోర్లో ఓ బీజేపీ ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసర్ను బ్యాట్తో కొట్టిన విషయం తెలిసిందే. తాజాగా గోవాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓ ఇంజినీర్పై బకెట్లతో బురద పోశాడు. కంకావలి వద్ద ముంబై-గోవా రహదారిపై ఉన్న బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే నితేశ్ రాణా, ఆయన మద్దతుదారులు ఇంజినీర్ ప్రకాశ్ షెడేకర్పై బకెట్ల ద్వారా బురదను పోశారు. ఆ తర్వాత ఆ ఇంజినీర్ను బ్రిడ్జ్కు కట్టేశారు. హైవేపై గతుకులు ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే, అతని అనుచరులు తమ ఆగ్రహాన్ని ఇంజినీర్పై చూపించారు.
#WATCH: Congress MLA Nitesh Narayan Rane and his supporters throw mud on engineer Prakash Shedekar at a bridge near Mumbai-Goa highway in Kankavali, when they were inspecting the potholes-ridden highway. They later tied him to the bridge over the river. pic.twitter.com/B1XJZ6Yu6z
— ANI (@ANI) July 4, 2019