ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్పై విడుదలైన కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు చిదంబరం పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంట్లో తన గళాన్ని ప్రభుత్వం తొక్కేయలేదన్నారు చిదంబరం.
అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఉల్లిధరలపై కాంగ్రెస్ ఈ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉల్లిపై చేసిన వ్యాఖ్యలపై చిదంబరం విమర్శలు చేశారు. ఉల్లిగడ్డ తిననని ఆర్థిక మంత్రి చెప్పారు. దానర్థమేంటీ అంటే ఆవిడ అవకాడో తింటారా అని ఎద్దేవాచేశారు.