నిర్మల సీతారామన్ ఉల్లిపాయ బదులు అవకాడో తింటారా : చిదంబరం

Update: 2019-12-05 07:28 GMT
చిదంబరం

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో బెయిల్‌పై విడుదలైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు చిదంబరం పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు. పార్లమెంట్‌లో తన గళాన్ని ప్రభుత్వం తొక్కేయలేదన్నారు చిదంబరం.

అనంతరం పార్టీ నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. పెరుగుతున్న ఉల్లిధరలపై కాంగ్రెస్‌ ఈ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఉల్లిపై చేసిన వ్యాఖ్యలపై చిదంబరం విమర్శలు చేశారు. ఉల్లిగడ్డ తిననని ఆర్థిక మంత్రి చెప్పారు. దానర్థమేంటీ అంటే ఆవిడ అవకాడో తింటారా అని ఎద్దేవాచేశారు.

Tags:    

Similar News