చిదంబరం అరెస్ట్‌పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్

ఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

Update: 2019-08-22 05:12 GMT

ఎన్ఎక్స్ మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. అరెస్ట్ అనంతరం చిదంబరాన్ని సీబీఐ హెడ్ క్వార్టర్స్‌కు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు. నేటి మధ్యాహ్నం సీబీఐ కోర్టులో చిదంబరంను హాజరుపర్చనున్న అధికారులు ... వారం పాటు కస్టడీ కోరనున్నారు. ఇదిలా ఉంటే చిదంబరం అరెస్ట్ పై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. మాజీ మంత్రి చిదరంబరం అరెస్ట్ ప్రజాస్వామ్య ప్రతిరూపానికి నిదర్శనమని.. చిదంబరం అరెస్ట్‌లో ఓ ప్రత్యేకత ఉంది. ఆయన కేంద్ర హోంమంత్రి హోదాలో సీబీఐ కేంద్రకార్యాలయాన్ని ప్రారంభించింది ఆయనే... ఇప్పుడు అదే కార్యాలయంలో కస్టడీలో ఉన్నారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని, నరేంద్రమోదీ ఇండియా మళ్లీ మళ్లీ నిరూపిస్తోంది'' అని ట్వీట్ చేశారు.



Tags:    

Similar News