ఛత్తీస్ గడ్ కి చెందినా ఓ ఇద్దరు భార్య భర్తలు పోటి పరీక్షలు రాసారు . అందులో ఏకంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో అగ్ర స్థానాల్లో నిలిచారు. భర్త తొలి ర్యాంకు సాధించగా.. భార్య రెండో ర్యాంకులో నిలిచారు.. బిలాస్ పూర్ కి చెందిన అనుభవ్ సింగ్ మరియు విభా సింగ్ కలిసి పోటి పరిక్షల్లో ఎంపీక కావడమే లక్షంగా పెట్టుకున్నారు . అ దిశగా వారి చదువును కొనసాగించారు .
ఇటీవల చీఫ్ మున్సిపల్ ఆఫీసర్(గ్రేడ్ బీ, గ్రేడ్ సీ)పరీక్షకు హాజరయ్యారు . అందులో తాజాగా వెలువడిన ఫలితాల్లో వీరిద్దరికీ మొదటి మరియు ద్వితీయ ర్యాంకులు వచ్చాయి . ఇందులో అనుభవ్ సింగ్ కి 298.3744 మార్కులు రాగా అతని భార్య విభా సింగ్కు 283.9151 మార్కులు వచ్చాయి. దీనితో వారి కుటుంబసభ్యులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు .