భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో చరిత్ర సృష్టించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన 'చంద్రయాన్ 2' ప్రయోగంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ విడిపోయింది. సోమవారం మధ్యాహ్నం 1:15 గంటలకు ఆర్బిటార్ నుంచి ల్యాండర్ విడివడినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. మొత్తానికి ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 7వ తేదీన చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ దిగనుంది. జులై 22న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ -2 నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. కొద్ది రోజులు భూకక్ష్యలో తిరిగి ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలో చేరింది చంద్రయాన్-2. ఆ తర్వాత కక్ష్య తగ్గింపు ప్రక్రియను ఐదు సార్లు సమర్థవంతంగా చేపట్టింది ఇస్రో.
#ISRO
— ISRO (@isro) September 2, 2019
Vikram Lander Successfully separates from #Chandrayaan2 Orbiter today (September 02, 2019) at 1315 hrs IST.
For details please visit https://t.co/mSgp79R8YP pic.twitter.com/jP7kIwuZxH