బిగ్‌ బ్రేకింగ్‌ : ల్యాండర్‌ విక్రమ్‌ ఆచూకీ తెలిసింది : ఇస్రో

Update: 2019-09-08 08:37 GMT

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ కీలక ప్రకటన చేశారు. చంద్రయాన్-2లో భాగంగా చంద్రుడిపైకి ప్రయోగించిన ల్యాండర్ 'విక్రమ్' ఎక్కడుందో తాము కనుగొన్నామని శివన్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను సేకరించామన్నారు. అయితే దానితో ఎలాంటి కమ్యునికేషన్స్ లేవన్నారు. విక్రమ్‌తో కాంటాక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే ఆ దిశగా విజయం సాధిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News