జైపూర్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. పాక్ నుంచి వచ్చిన హిందువులకు..

Update: 2019-11-29 05:43 GMT
జైపూర్

పాకిస్థాన్ దేశానికి చెందిన 21 మంది హిందువులకు భారత పౌరసత్వం లభించింది. ఇందుకు వీలు కల్పిస్తూ జైపూర్ జిల్లా కలెక్టరు సంచలన నిర్ణయం తీసుకున్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి 2014 డిసెంబరు 31వతేదీలోగా భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం దక్కుతుంది. ఈ మేరకు ఈ ఏడాది జనవరి 8వతేదీన లోక్ సభలో బిల్లు పాస్ అయింది. ఆ నేపథ్యంలోనే తాజాగా 21 మంది హిందువులకు భారత పౌరసత్వం లభించింది.


 

Tags:    

Similar News