ఉత్తరప్రదేశ్లోని లక్నో సెషన్స్ కోర్ట్ వద్ద బాంబు పేలుళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. బాంబ్ పేలుళ్లలో పలువురు న్యాయవాదులకు గాయాలయ్యాయి. మరో మూడు పేలని బాంబులను బాంబ్స్వ్కాడ్ స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుళ్లకు గల కారణాలను, సీసీటీవీ ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. సంజీవ్లోధీ అనే న్యాయవాది టార్గెట్గా బాంబులు అమర్చినట్లు అనుమానిస్తున్నారు. సంజీవ్లోధీ ప్రత్యర్థివర్గాల కుట్రగా పోలీసులు భావిస్తున్నారు.