Jammu and Kashmir: జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి
Jammu and Kashmir: గుండ్బాల్ బట్వారా ప్రాంతంలో ఘటన
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లోని జీలం నదిలో ప్యాసింజర్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. గుండ్బాల్ బట్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గల్లంతైన వారి మృతదేహాల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. మరో వైపు కశ్మీర్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.
అయితే గుండ్బాల్ను శ్రీనగర్ను కలిపే బ్రిడ్జి గత దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉందని, దీంతో స్థానిక ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు వాపోతున్నారు.