Jammu and Kashmir: జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

Jammu and Kashmir: గుండ్‌బాల్ బట్వారా ప్రాంతంలో ఘటన

Update: 2024-04-16 05:16 GMT

Jammu and Kashmir: జీలం నదిలో పడవ బోల్తా.. నలుగురు మృతి

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని జీలం నదిలో ప్యాసింజర్ బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు. గుండ్‌బాల్ బట్వారా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక గల్లంతైన వారి మృతదేహాల కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నదిలో గాలింపు చర్యలు చేపట్టాయి. మరో వైపు కశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జీలం నది ‎ఉధృతంగా ప్రవహిస్తుండడంతో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది.

అయితే గుండ్‌బాల్‌ను శ్రీనగర్‌ను కలిపే బ్రిడ్జి గత దశాబ్ద కాలంగా నిర్మాణంలో ఉందని, దీంతో స్థానిక ప్రజలు నదిని దాటాలంటే పడవలను ఆశ్రయించాల్సి వస్తోందని చెబుతున్నారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు వాపోతున్నారు.

Tags:    

Similar News