వివాహితతో కలిసి క్షుద్రపూజలు.. స్వామిజి సజీవదహనం

వివాహితతో కలిసి క్షుద్రపూజలు.. స్వామిజి సజీవదహనం వివాహితతో కలిసి క్షుద్రపూజలు.. స్వామిజి సజీవదహనం

Update: 2019-09-27 03:43 GMT

వివాహితతో కలిసి అర్ధరాత్రి ఓ స్వామీజీ క్షుద్రపూజలు చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో స్వామీజీ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం తమిళనాడు రాష్ట్రంలో జరిగింది. నంగనల్లూరుకు చెందిన స్వామీజీ గోవిందరాజ్‌(49). తిరువళ్లూరు జిల్లా ఎరయమంగళంలో ఎకర స్థలాన్ని కొనుగోలు చేసి అక్కడే ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు. క్షుద్రపూజలు, జ్యోతిష్యం, యాగాలు, సిద్ధవైద్యం చెయ్యడం ఈయనకు అలవాటు. చెన్నై చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలు స్వామీజీ గోవిందరాజ్‌ వద్దకు వస్తుండేవారు. ఈ క్రమంలో 15 రోజుల కిందట వివాహిత లావణ్య స్వామిజి వద్దకు వచ్చి అక్కడే పూజలు చేస్తూ ఆశ్రయం పొందుతోంది.

గత పదిహేను రోజులుగా ఆమె స్వామిజి చేస్తున్న క్షుద్రపూజల్లో పాల్గొంటుంది. అయితే బుధవారం రాత్రి 12 గంటలకు పూజ చేస్తున్న సమయంలో భారీ శబ్ధంతో పేలుడు సంభవించింది. వెంటనే పక్క గదిలో వున్న లావణ్య వచ్చి చూడగా గోవిందరాజ్‌ సజీవదహనమై కేకలు వేస్తూ కనిపించాడు. వెంటనే సదరు మహిళ చుట్టుపక్కల వారికి విషయం చెప్పింది. వారు చేరుకునే లోపే ఆ స్వామిజి సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గోవిందరాజ్‌ మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించారు. ఫోరెన్సిక్‌ అధికారులు స్వామిజి మృతదేహానికి పరీక్షలు చేస్తున్నారు. 

Tags:    

Similar News