ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిని చితకబాదారు
పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్ సదర్, కలియాగంజ్, కరీంపూర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జయప్రకాశ్ మజుందార్పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు.
ఈ ఘటన జియాఘాట్ ఇస్లాంపూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వచ్చిన జయప్రకాశ్పై తృణమూల్ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. పోలింగ్ కేంద్రం బయట జయప్రకాశ్ను కాళ్లతో తన్నుతూ చెట్లలోకి తోసేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసు బలగాలు కార్యకర్తలను చెదరగొట్టారు.
#WATCH West Bengal BJP Vice President and candidate for Karimpur bypoll, Joy Prakash Majumdar manhandled and kicked allegedly by TMC workers as voting is underway in the constituency. #WestBengal pic.twitter.com/Vpb5s14M5A
— ANI (@ANI) November 25, 2019