ఐదు పైసలకే బిర్యానీ : ఆఫర్ అదిరింది.. కానీ ఇక్కడే అసలు తిరకాసు...

Update: 2019-10-17 09:28 GMT

ఎక్కడ చూసిన ప్లేట్ బిర్యానీ ధర మామలు అయితే ఎంత ఉంటుంది. ఎంత కాదనుకున్నా డెబ్బై నుండి నూట యాబై వరకు ఉంటుంది. కానీ అయిదు పైసలకే బిర్యానీ అంటే నమ్ముతారా..! అవును నమ్మాలి ఇది నిజం కూడా.. ఇక వివరాల్లోకి వెళ్తే తమిళనాడు రాష్ట్రం ఆర్కే నగర్‌లోని దిండుక్కల్‌లో ముజిబ్ బిర్యానీ యాజమాన్యం బుధవారం రోజున ప్రపంచ ఆహార దినోత్సవం సందర్బంగా ఐదు పైసలకే ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించారు.

కానీ అయిదు పైసలు అంటే గతంలో చలామణిలో ఉన్నా అయిదు పైసలు తీసుకువస్తేనే ఒకటిన్నర  ప్లేటు బిర్యానీని అందిస్తారు. సోషల్ మీడియాలో  కొద్ది రోజుల కింద ముజిబ్ బిర్యానీ ఐదు పైసలకే ప్లేటున్నర చికెన్ బిర్యానీ అని, మొదటి 100 మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని ప్రకటించింది. దీనితో అక్కడికి అయిదు పైసలు తీసుకొని చాలా మంది వచ్చారు.

అలా తీసుకొని వచ్చిన వారికి ఒకటిన్నర ప్లేటు బిర్యానీని అందించింది ముజిబ్ బిర్యానీ.. దీనికి గాను మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడికి వచ్చి బిర్యానీ తీసుకున్నవారు ఆనందం వ్యక్తం చేసారు. అయితే ఇలా ఆఫర్స్ పెట్టడానికి గల కారణం గురించి ముజిబ్ బిర్యానీ యజమాని ముజిఫ్ రహ్మాన్ మాట్లాడుతూ... భవిష్యత్తు తరానికి మనం వాడిన వస్తువులను తెలియజేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు.. 

Tags:    

Similar News