ఆయోధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై సుప్రీం కోర్టు కీలక కీలక వ్యాఖ్యలు చేసింది. సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు తెలిపింది. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. వాదనలు ముగిసే వరకూ కేసును రోజువారీ విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ అబ్ధుల్ నజీర్లతో కూడిన బెంచ్ పేర్కొంది.