జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు ఈ రకంగా మారడానికి దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. పార్లమెంట్లో ప్రసంగించిన అమిత్ షా సర్దార్ పటేల్ సలహాలు పాటించి ఉంటే జమ్మూ కాశ్మీర్ సమస్య ఎప్పుడో పరిష్కారమయ్యేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్పై అమిత్షా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ప్రజాస్వామ్యం గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదని అమిత్ షా అన్నారు.