ముంబైలోని ప్రఖ్యాత లాల్ భాగ్ ఛ వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు, రాజకీయ సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భారీ ఆకారంలో ఆశీర్వదిస్తున్న ఈ వినాయకుడు ఈ సారి చంద్రయాన్ సెట్లో కొలువుదీరాడు.
ఈ సాయంత్రం స్వామివారిని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొక్కులు కూడా చెల్లించుకున్నారు. వినాయకుడి పాదాలకు నమస్కరించారు. ఆ తర్వాత చిన్నపాపను ఎత్తుకుని కలియ తిరిగారు. అందరికీ అభివాదం తెలిపారు. అమిత్ షా తో పాటు లాల్ భాగ్ఛ వినాయకుడిని స్థానిక బీజేపీ నాయకులు కూడా దర్శించుకున్నారు.
వినాయకుడి వెనుక భాగంలో వ్యోమగాములు, గ్రహాలు తిరగడం ఉపగ్రహాల రాకపోకలతో.. ఆ ప్రాంతమంతా కొత్తగా కనిపిస్తుంది. ఈ దృశ్యాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నవరాత్రుల్లో లక్షలాదిగా లాల్భాగ్ఛ వినాయకుడిని దర్శించుకుంటారని నిర్వాహకులు తెలిపారు.