అమెరికన్ ఆర్మీ భారతీయుల మనసులను దోచుకుంది. వాషింగ్టన్ లో భారత్-అమెరికా సైన్యం నిర్వహిస్తున్న సంయుక్త విన్యాసాల సందర్భంగా అమెరికన్ ఆర్మీ బ్యాండ్ మన జాతీయగీతం జనగణమన ను అద్భుతంగా వాయించింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యుద్ధ్ అభ్యాస్-2019 విన్యాసాల సందర్భంగా వాషింగ్టన్ లోని లూయీస్ మెక్ కార్డ్ బేస్ లో మన జాతీయగీతాన్ని ఆలపించారు. ఇరు దేశాల రక్షణ ఒప్పందాల్లో భాగంగా ఈ బేస్ లో సంయుక్త మిలిటరీ ట్రైనింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇరు దేశాల మధ్య ఇక్కడ జాయింట్ ఎక్సర్ సైజ్ జరుగుతుండటం ఇది 15వ సారి.
#WATCH USA: American Army band playing Indian National Anthem during the Exercise Yudh Abhyas 2019 at Joint Base Lewis, McChord. pic.twitter.com/J9weLpKD3X
— ANI (@ANI) September 19, 2019