ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం అంబులెన్సును ఆపేశారు

Update: 2020-04-28 16:12 GMT
Ambulance

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కాన్వాయ్‌ వెళ్లడానికి అత్యవసర సేవలందించే అంబులెన్సును నిలిపివేయడంపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన చెన్నైలోని ఐలాండ్ గ్రౌండ్ సిగ్నల్ వద్ద జరిగింది.

ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సుకు హాజరు కావడానికి ముఖ్యమంత్రి వెళ్లగా వాహనాలను ఆపి వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్‌డౌన్‌ సమయంలో ఇలా ముఖ్యమంత్రి కాన్వాయ్‌ కోసం అంబులెన్సును ఆపడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Tags:    

Similar News