శిక్షణ విమానం కూలి ఇద్దరు మృతి

Update: 2020-06-08 05:37 GMT

శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు ట్రైనీ పైలట్లు మరణించిన ఘటన సోమవారం ఒడిశాలోని ధెంకనల్ జిల్లాలో వెలుగుచూసింది. ఢెంకానల్‌ జిల్లాలోని బిరసల్‌ వైమానిక స్థావరంలో సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలిందని అధికారులు తెలిపారు. ఈ స్థావరం నివాస సముదాయాలకు దూరంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు.

దీంతో శిక్షణ పొందుతున్న మహిళా పైలట్‌ అనీస్‌ ఫాతిమా, శిక్షకుడు కెప్టెన్‌ సంజీబ్‌ కుమార్‌ ఝా అక్కడిక్కడే మృతిచెందారు. అనీస్‌ ఫాతిమా తమిళనాడుకు చెందినవారు కాగా, సంజీబ్‌ కుమార్‌ బీహార్‌కు చెందినవారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది. కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామక్షయనగర్‌ సబ్‌డివిజనల్‌ దవాఖానకు తరలించామని ఎస్పీ అనుపమా జేమ్స్‌ వెల్లడించారు.
 

 

Tags:    

Similar News