మహాత్ముడికి ఎయిర్‌ఇండియా వినూత్న నివాళి

Update: 2019-10-02 11:43 GMT

మహాత్ముని జయంతి వేడుకలను ఎయిర్‌ ఇండియా కంపెనీ వినూత్నంగా జరిపింది. విమానంపై మహాత్ముని చిత్రాన్ని ఆవిష్కరించారు. విమాన రెక్కలపై, ఎరుపు రంగులో గాంధీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏ320 విమానం వెనుక భాగంలో బాపూజీ చిత్రపటాన్ని ముద్రించింది. విమానం తోక భాగంలో 11 అడుగుల ఎత్తు 5 అడుగుల వెడల్పుతో గాంధీజీ చిత్రాన్ని వేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.  

Tags:    

Similar News