పోలీసులపై దాడిచేసిన నిందితుడికి కరోనా పాజిటివ్

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు వైద్యులు.

Update: 2020-04-11 10:24 GMT

మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితుడికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు వైద్యులు. ఇండోర్‌లోని చందన్ నగర్‌లో పోలీసులపై రాళ్లు విసిరి, దురుసుగా ప్రవర్తించాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

శనివారం ఉదయం ఐసిఎంఆర్ ల్యాబ్ నుండి వచ్చిన నివేదికలో నిందితునికి కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు దీంతో నిందితుడు జావేద్ ఖాన్ ను హాస్పిటల్ వార్డు లోపల నిర్బంధించారు. గతంలో ఇండోర్‌లోని పోలీసు బృందంపై దాడి చేసిన నలుగురు నిందితులను జబల్‌పూర్‌ జైలుకు తీసుకువచ్చారు,

అప్పటి నుంచి ఒకరి ఆరోగ్యం బాగోలేకపోవడంతో అనుమానం వచ్చి అందరిని ఆసుపత్రిలో చేర్చారు . ఆ తర్వాత వారి రక్త నమూనాలను తీసుకున్నారు. అయితే వాటిలో ఒకటి కరోనా వైరస్ కు పాజిటివ్‌గా వచ్చింది. మిగిలిన ముగ్గురికి నెగెటివ్‌గా వచ్చింది, దాంతో ముగ్గురిని జైలుకు తరలించారు.

అయితే వారిని కూడా కొన్ని రోజులు నిర్బంధంలో ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. మరోవైపు జబల్పూర్లో 10 కరోనావైరస్ కేసులు ఉంటే.. వీరిలో ఐదుగురు రోగులు కోలుకొని తమ ఇంటికి వెళ్లారు.


Tags:    

Similar News