యూపీ బన్‌కే బీహారీ ఆలయంలో విషాదం

*మంగళ హారతి కార్యక్రమానికి తరలివచ్చిన భక్తులు

Update: 2022-08-20 06:00 GMT

యూపీ బన్‌కే బీహారీ ఆలయంలో విషాదం

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌ మధురలోని ఆలయంలో విషాదం చోటు చేసుకున్నది. బృందావనంలోని బన్‌కే బీహారీ ఆలయంలో జరిగిన మంగళ హారతి కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో తొక్కిసలాట జరిగింది. దీంతో ఊపిరి ఆడక ఇద్దరు భక్తులు చనిపోయారు.. పలువురు భక్తులు గాయపడ్డారు.. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురు భక్తులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News